Google Photos: పొరపాటున గూగుల్ ఫోటో డిలీట్ అయ్యాయా? మరేం పర్వాలేదు ఇలా రికవరీ చేసుకోండి..

Google Photos

Google Photos Updates: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ Google ఫోటోలను ఆన్‌లైన్ బ్యాకప్‌గా ఉపయోగిస్తున్నారు. కారణం.. ఇది సురక్షితం అని భావించడమే. ఫోటోలు, వీడియోలను కూడా బ్యాకప్ చేయొచ్చు. అయితే, కొన్నిసార్లు ఫోటోలు, వీడియోలు పొరపాటున డిలీట్ అవుతుంటాయి. డిలీట్ అయిన ఫోటోల రికవరీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఫోటోస్ నుంచి డిలీట్ అయిన ఫోటోలు, వీడియోలను ఎలా రికవరీ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ఫోటోలను రికవరీ చేయాలంటే..
1: ఫోటో, వీడియోని ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లోకి రికవరీ చేయాలంటే.. ముందుగా గూగుల్ ఫోటోస్ యాప్‌ని తెరవండి.
2: యాప్ ఓపెన్ చేసిన తరువాత దిగువన ఉన్న లైబ్రరీ ఆప్షన్‌పై నొక్కండి. ఆ తరువాత ట్రాష్ ఫోల్డర్‌కి వెళ్లండి.
3: మీరు రికవరీ చేయాలనుకుంటున్న ఫోటో, వీడియోని గుర్తించి.. దానిని సెలక్ట్ చేయాలి.
4: దిగువన రీస్టోర్ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
5: ఫోటో, వీడియో తిరిగి మీ ఫోన్ గ్యాలరీ యాప్‌లోకి, గూగుల్ ఫోటోస్ లైబ్రరీలోకి తిరిగి యాడ్ అవుతుంది.
6: కంప్యూటర్‌లో అయితే, మీరు photos.google.comకి వెళ్లాలి.
7: విండో ఎడమ వైపున ఉన్న ట్రాష్ ఫోల్డర్‌పై క్లిక్ చేయండి.
8: మీరు రికవరీ చేయాలనుకుంటున్న ఫోటో, వీడియోపై మీ కర్సర్‌ని ఉంచండి. ఆ తరువాత సెలక్ట్‌పై క్లిక్ చేయండి.
9: ఎగువ కుడివైపున ఉన్న రీస్టోర్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
10: ఫోటో, వీడియో మీ గూగుల్ ఫోటోస్‌ అకౌంట్‌లోకి రికవరీ చేయబడుతుంది.

మరి iPhone, iPad గ్యాడ్జెట్లలో తొలగించబడిన Google ఫోటోలను ఎలా రికవరీ చేయాలో తెలుసుకుందాం..
1: మీ iOS పరికరంలో Google ఫోటోస్ తెరవాలి. ఎగువ ఎడమవైపు ఉన్న త్రీ-లైన్ మెనుపై నొక్కి ‘బిన్’ను సెలక్ట్ చేసుకోవాలి.
2: కుడివైపున ఎగువ మూలలో మూడు చుక్కలతో ఉన్న మెనూని క్లిక్ చేయాలి. సెలక్ట్‌ను ఎంచుకోవాలి.
3: ఇప్పుడు మీరు రీస్టోర్ చేయాలనుకుంటున్న ఫోటోలను సెలక్ట్ చేసుకోవాలి.
4: ఫోటోను సెలక్ట్ చేసుకున్న తరువాత రీస్టోర్ బటన్‌పై క్లిక్ చేయాలి.
5: ఇలా చేయడం ద్వారా మీరు సెలక్ట్ చేసుకున్న అన్ని ఫోటోలు, వీడియోలో యాప్‌లోని ఫోటో లైబ్రరీలోకి తిరిగి వస్తాయి.

Also read:

Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Ip9krQ

Baca juga

Post a Comment