Telangana: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి డైవైడర్ ను ఢీకొని ట్రావెల్ బస్సు బోల్తా .. 10మందికి గాయాలు

Telangana: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు రక్తమోడుతున్నాయి. రోజులో ఎక్కడో చోట రోడ్డు ప్రమాదం జరిగిందనే వార్తలు వినిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిత్యం రక్తమోడుతున్న రహదారులు ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. నిన్నటి ఘోర రోడ్డు ప్రమాదం ఘటన ఇంకా మరవక ముందే నేడు తెలంగాణలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కందుకూరు కి వెళ్తున్న ఓ ప్రయివేట్ ప్రయివేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే..
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొండడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న వేములపల్లి పోలీసులు తక్షణమే క్షతగాత్రులకు సహాయక చర్యలను అందించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/ckrmlEg
Related Posts
- Vivo X80, X80 Pro: వివో ఎక్స్ సిరీస్ను అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు.. అత్యాధునిక కెమెరా టెక్నాలజీతో..
- KTR: 20 ఏళ్లలో కేటీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే..
- GT vs RR IPL Match Result: ఐపీఎల్లో ఫైనల్కు చేరుకున్న గుజరాత్.. రాజస్థాన్పై ఘన విజయం..
- CRIS Recruitment:సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..
- Ramcharan: శంకర్-రామ్చరణ్ సినిమాపై క్రేజీ అప్డేట్.. చెర్రీ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా..
- Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబుకు 14 రోజుల రిమాండ్.. మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు..
Post a Comment
Post a Comment