What India Thinks Today: హింసాత్మక నిరసనలకు దూరంగా ఉండండి.. టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌లో రవిశంకర్ ప్రసాద్, ఆనంద్ శర్మ

What India Thinks Today

What India Thinks Today: ఆర్మీ కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్ అగ్నిపథ్‌పై జరుగున్న హింసాత్మక నిరసనలకు దూరంగా ఉండాలని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ యువతకు సూచించారు. సంయమనంతో వ్యవహరించాలని కోరారు. టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘‘వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌’’లో ఇద్దరు నేతలు అగ్నిపథ్ పథకం, ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలపై మాట్లాడారు. ‘‘దయచేసి శాంతిని కాపాడండి. రైళ్లు ప్రజల ఆస్తి.. మీరు కూడా వాటిని ఉపయోగించుకోండి. ఇది మీ దేశం, అన్ని పథకాలు సామాన్య ప్రజల ప్రయోజనాల కోసమే’’ అంటూ రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

COVID-19 మహమ్మారి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి నియామకాలు జరగలేదని దీంతోనే తీవ్ర దుమారం రేగినట్లు ఆనందర్ శర్మ అన్నారు.

‘‘హింస ఉండకూడదు. దీనిపై అనిశ్చితి ఉన్నందున యువత భయపడుతున్నారు. COVID-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రిక్రూట్‌మెంట్‌లు లేవు. అందుకే ఆగ్రహం ఉంది. కానీ శాంతిని కాపాడాలని నేను వారిని కోరతతున్నాను’’ అని శర్మ పేర్కొన్నారు.

శిక్షణ పొందిన వ్యక్తులు అందుబాటులో ఉంటారు..

అగ్నిపథ్ పథకం ప్రయోజనాల గురించి ప్రసాద్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తర్వాత శిక్షణ పొందిన వారు అందుబాటులో ఉంటారు. వారు ఇంకా CRPF, ఇతర దళాలలో చేరవచ్చు. నేను నిపుణుడిని కాదు, కానీ CRPF, ఇతర దళాలలో చేరగల శిక్షణ పొందిన వ్యక్తుల సమూహం ఉంటుందని నేను చెప్పగలను. ఏదైనా ఆందోళన ఉంటే చర్చ అవసరం అని నేను అంగీకరిస్తున్నాను,” అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

ఇండియా ఫస్ట్ – భారతదేశం సంవత్సరాలుగా ఎలా అభివృద్ధి చెందింది..

ఏడాది కాలంలో భారతదేశం గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని బీజేపీ నేత ప్రసాద్ పేర్కొన్నారు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో మేము అనేక దేశాలకు సహాయం చేసాము. మన ప్రభుత్వం టీకా దౌత్యం కావచ్చు, మరేదైనా కారణాలు కావొచ్చు.. ప్రపంచ వేదికపై భారతదేశం మాట వినడానికి కారణం ఇదే అని ఆయన చెప్పారు.

దీనిపై శర్మ ప్రసాద్‌తో ఏకీభవించగా, ప్రతి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ ఉత్తమమైన సేవలను అందించడానికి వెనుకాడలేదంటూ పేర్కొన్నారు.

“ప్రతి ప్రభుత్వమూ తమ హయాంలో తమ సత్తా చాటింది.. మేం అధికారంలో ఉన్నప్పుడే తొలి తయారీ విధానాన్ని నా హయాంలో తీసుకొచ్చాం.. డెడికేటెడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేసి నేడు బాగానే పనిచేస్తున్నాయి.. ప్రత్యేక ఫ్రైట్‌ కారిడార్‌ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాం. కొనసాగుతున్న ప్రక్రియ మరియు పని జరుగుతోంది” అని శర్మ చెప్పారు.

మేము వివక్ష చూపము..

“మా విధానాలు వివక్ష చూపవు అనేది నిజం. మేము జన్ ధన్ యోజనను ప్రారంభించినప్పుడు లేదా ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చినప్పుడు, మేము లబ్ధిదారుల కులం లేదా సంఘం గురించి అడగము. మమ్మల్ని ప్రాతిపదికగా అంచనా వేయాలి. అదే మా పని విధానం” అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

Source Link

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/lYKqevI

Baca juga

Post a Comment