Andhra Pradesh: వరద బాధితులకు అండగా ఏపీ ప్రభుత్వం.. సహాయక చర్యలకు ఇప్పటి వరకు రూ. 42 కోట్లు ఖర్చు..

Ap Rains

Andhra Pradesh Floods: భారీ వర్షాల కారణంగా ఆంధప్రదేశ్‌ అతలాకుతలమైన విషయం తెలిసిందే. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడం, భారీ వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. రైతులు వేలాది ఎకరాల్లో పంట నష్టపోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. లంక గ్రామాల ప్రజలు గ్రామలను వదిలి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. ఏకంగా 241 గ్రామాలపై ఈ వరద తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇదిలా ఉంటే వరద బాధితులను ఆదుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే స్పందిచంది. వరద బాధితులకు తక్షణ సాయం, సహాయక చర్యలకుగాను ఇప్పటివరకూ రూ. 42 కోట్లు ఖర్చు చేసింది.

వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన సుమారు 1,50,958 మందికి 218 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. బాధితులకు తక్షణ సాయం కింద ఇప్పటి వరకు ఒక్కో కుటుంబానికి రూ. 2000 చొప్పును మొత్తం రూ. 13.62 కోట్లను ప్రభుత్వం అందించింది. ఇక వివిధ సహాయక చర్యలు, నిత్యావసరాల పంపిణీకి రూ. 13 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల ప్రభావం 241 గ్రామాలపై పడింది. వరదాల నేపథ్యంలో జరిగిన నష్టంపై ప్రభుత్వం శాఖలవారీగా అంచనా వేస్తోంది. 2070 ఎకరాల్లో వ్యవసాయం, 8624 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/uHerRZ8

Baca juga

Post a Comment