What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today updates 18.08.2022
1. నేడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో మాణిక్కం ఠాగూర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికపై చర్చించనున్నారు.
2. నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. సాయంత్రం 5గంటలకు సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు.
3. నేటి నుంచి ఆన్లైన్లో కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్స్అందుబాటులో ఉండనున్నాయి. నేటి నుంచి అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 1600 పోస్టులకు 6లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1601 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు.
4. నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.
5. నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలకు పిలుపునిచ్చిన ఏపీ సర్కార్. సీపీఎస్పై ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం చర్చించనుంది.
6. నేడు భారత్-జింబాబ్వే మధ్య తొలి వన్డే జరుగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనుంది టీమిండియా.
7. నేడు చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం.
8. నేటి నుండి గుంటూరు- నంద్యాల -తిరుపతి నూతన రైలు ప్రారంభం. కోవెలకుంట్లలో స్టాపింగ్ లేనందుకు రైల్వే స్టేషన్ ప్రజాసంఘాలు. రాజకీయ పార్టీల నిరసన.
9. ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుండి రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభం. ఈనెల 21 వరకు జరుగునున్న పోటీలు.
10. నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 లుగా ఉంది. అలాగే.. కిలో వెండి ధర రూ.63,300 లుగా ఉంది.
from NTV Telugu https://ift.tt/4MWklhF
Post a Comment
Post a Comment