Cricket: అభిమాన క్రికెటర్ ను దుర్భాషలాడాడని.. బ్యాటుతో కొట్టి చంపేశాడు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..

భారతదేశంలో క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. టీమ్ గురించి మాత్రమే కాకుండా.. ప్లేయర్ల పట్ల కూడా అభిమానం పెంచుకుంటారు. అభిమాన ఆటగాడి గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా అస్సలు ఊరుకోరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చినప్పటి నుంచి ఈ అభిమానం మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఇంటర్నెట్ వేదికగా రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి అభిమానులు గొడవ పడుతున్నారు. ఎవరు బెటర్ ప్లేయర్ అనే చర్చ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తమిళనాడులోని అరియలూరు జిల్లా పొయ్యూరు గ్రామంలో విఘ్నేష్, ధర్మరాజ్ మధ్య వివాదం జరిగింది. వారిద్దరూ స్నేహితులు. వారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అక్టోబర్ 11వ తేదీ రాత్రి వీరిద్దరి మధ్య మల్లూరులోని సిడ్కో ఇండస్ట్రియల్ ఏరియాలో క్రికెట్పై చర్చ జరిగింది.
ఇద్దరూ మద్యం సేవించి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో విఘ్నేష్ ఆర్సీబీ, విరాట్ కోహ్లీ గురించి తక్కువగా మాట్లాడారు. దీంతో కోపోద్రిక్తుడైన ధర్మరాజ్ మొదట విఘ్నేష్ తలపై బాటిల్ తో కొట్టాడు. అనంతరం బ్యాట్తో తీవ్రంగా బాదాడు. ఈ ఘటనలో విఘ్నేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తీవ్ర భాయాందోళనకు గురైన ధర్మరాజు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ధర్మరాజును అదుపులోకి తీసుకున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుత కాలంలో భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచ క్రికెట్లోనూ టాప్ ప్లేయర్లుగా ఉన్నారు. వీరిద్దరూ ఐపీఎల్లో కూడా తమ తమ ఫ్రాంచైజీలకు కెప్టెన్లుగా ఉన్నారు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై 5 సార్లు టైటిల్ గెలుచుకుంది, విరాట్ కెప్టెన్సీలో బెంగళూరు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. దీని కారణంగా తరచుగా రెండు జట్ల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో చాలా గొడవ జరుగుతోంది.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/Hed9rtL
Post a Comment
Post a Comment