What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే.. లక్నోలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్
* నేటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం.. రెండు రోజుల విరామం తర్వాత ప్రారంభంకానున్న యాత్ర
* నేడు సీఈసీని కలవనున్న టీఆర్ఎస్ నేతల బృందం.. ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్కు ఈసీ అపాయింట్మెంట్… బీఆర్ఎస్ పేరు తీర్మానాన్ని ఈసీకి ఇవ్వనున్న నేతలు
* నేడు రాజమండ్రిలో అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం.. అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలకు ఆహ్వానం
* హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలయ్-బలయ్.. హాజరుకానున్న మెగాస్టార్ చిరంజీవి
* శ్రీశైలంలో వైభవంగా చివరిరోజు దసరా మహోత్సవాలు.. నిజాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి.. ఆలయంలో నందివాహనంపై శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవం.. జమ్మిచెట్టు వద్ద శాస్త్రోక్తంగా శమీ పూజలు నిర్వహించిన అర్చకులు
* శ్రీశైలంలో నేటితో ముగిసిన దసరా మహోత్సవాలు.. ఆలయ పుష్కరిణిలో వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి తెప్పోత్సవం.. పుష్కరిణిలో తెప్పోత్సవంపై విహరిస్తున్న ఆదిదంపతులు.. భక్తులు, స్థానికుల శివనమస్మరణతో మారుమోగుతున్న పుష్కరిణి
* తిరుమల: .నేడు శ్రీవారి ఆలయంలో బాగ్ సవారి.. మాడవీధులలో అప్రదక్షణంగా ఉరేగునున్న మలయప్పస్వామి
* గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న 41 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ఈరోజు, రేపు మౌఖిక పరీక్షలు…
from NTV Telugu https://ift.tt/3McTst1
Post a Comment
Post a Comment