What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What’s Today:
* ఢిల్లీ: నేడు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్.. ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం
* ఏపీలో రెండో రోజు భారత్ జోడో యాత్ర.. ఈరోజు ఆదోనీ మండలం చాగీ నుంచి ప్రారంభం కానున్న రాహుల్ పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదోనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్
* నేడు పల్నాడు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న చంద్రబాబు.. చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటన
* నేడు రాజమండ్రి రూరల్ ఏరియాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర.. రాజమండ్రి మోరంపూడి సెంటర్ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర
* పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరు మండలం సారికలో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర
* గుంటూరు: నేడు నెక్కల్లులో బ్రహ్మ కుమారీస్ సంస్థ నిర్మించిన యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ను ప్రారంభించనున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
* టీ20 ప్రపంచకప్: నేడు భారత్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్.. బ్రిస్బేన్ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్
from NTV Telugu https://ift.tt/vZFu35C
Post a Comment
Post a Comment