Rashmika Mandanna: మహేష్తో స్పెషల్ సాంగ్ చేయనున్న రష్మిక.. ఒక్క పాట కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా ?..

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికలుగా కొనసాగుతున్న ముద్దుగుమ్మలు.. స్పెషల్ సాంగ్స్కు కూడా సై అంటున్నారు. ఓవైపు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూనే.. ఈ పాటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే, తమన్నా, రెజీనా కసాండ్రా, కాజల్, సమంత స్టార్ హీరోయిన్స్ ఐటెం స్టాంగ్స్ లో మెరిసారు. ఇటీవల పుష్ప మూవీలో సామ్ నటించిన ఓ అంటావా సాంగ్ యూట్యూబ్ సెన్సెషన్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇందుకు హీరోయిన్స్ కూడా పెద్ద మొత్తంలోనే పారితోషికం తీసుకుంటారు. ఇప్పుడు రష్మిక కూడా స్పెషల్ సాంగ్ స్టెప్పులేయనుందట. అంతేకాదు.. ఇందుకోసం భారీగా వసూలు చేస్తుందట. ఇంతకీ నేషకల్ ఎవరితో స్టెప్పులేయనుంది ? తెలుసుకుందామా.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో రష్మిక ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. ఇందుకు ఈ ముద్దుగుమ్మ భారీగానే డిమాండ్ చేస్తోందట. ఈ పాట కో సం ఏకంగా రూ. 4 కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం నేషనల్ క్రష్ పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ్ స్టార్ విజయ్ దళపతి నటిస్తోన్న వరిసు చిత్రంలోనూ కనిపించనుంది. అలాగే బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/w8vaoGS
Post a Comment
Post a Comment