What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

* నేటి నుంచి ఫిఫా వరల్డ్‌కప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌.. రాత్రి 8.30 గంటలకు బ్రెజిల్‌తో క్రొయేషియా ఢీ, రాత్రి 12.30కి అర్జెంటీనాతో నెదర్లాండ్స్‌ మ్యాచ్‌

* బలహీనపడుతున్న మాండూస్‌ తుఫాన్‌.. నేటి అర్ధరాత్రికి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరందాటే అవకాశం

* శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. శబరిమలకు లక్షలాదిగా చేరుకున్న భక్తులు, నిన్న రాత్రి నుంచి పూర్తిగా నిండిపోయిన కంపార్ట్‌మెంట్లు, అయ్యప్ప భక్తులతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

* నేడు మధ్యాహ్నం 1.20కి బీఆర్ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమం.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ జెండా ఆవిష్కరించనున్న పార్టీ అధినేత కేసీఆర్

* హైదరాబాద్‌: నేడు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు శంకుస్థాపన.. మైండ్ స్పేస్ దగ్గర ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్.. శంకుస్థాపన తర్వాత అప్పా పోలీసు అకాడమీ దగ్గర సభలో ప్రసంగించనున్న కేసీఆర్..

* నేడు గుంటూరులో పర్యటించనున్న కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ముక్ మీత్ భాటియా.. ప్రీ మాట్రిక్ బాలికల హాస్టల్లతోపాటు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించనున్న భాటియా.

* గుంటూరు: నేడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా

* గుంటూరు: నేటి నుండి మూడు రోజులు పాటు పరమయ్య కుంటలోని భద్రకాళి అమ్మవారి దేవస్థానం బోనాల జాతర ఉత్సవం.

* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. పొన్నూరులో ముస్లిం సంఘాలతో సమావేశం కానున్న చంద్రబాబు. సాయంత్రం అప్పికట్ల నుండి బాపట్ల వరకు రోడ్ షో.. అనంతరం బాపట్ల అంబేద్కర్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.

* పల్నాడు: రేపు జొన్నలగడ్డలోని 220 కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నరసరావుపేట టౌన్, రూరల్ మండల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం.

* విశాఖపట్నం- విజయవాడ మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలును గుంటూరు వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు…

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు

* నెల్లూరు: విడవలూరులోని మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర నైపుణ అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా

* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం శాఖ మంత్రి తానేటి వనిత కార్యక్రమాలు. ఉదయం 11 గంటలకు విజయవాడ రాజ్ భవన్ లో జరిగే ఆర్మడ్ ఫోర్స్ ఫ్లాగ్ డే కార్యక్రమానికి హాజరవుతారు.

* కడప: నేడు కన్యతీర్థం నుంచి స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర ప్రారంభం.. 13న కలెక్టరేట్ చేరుకోనున్న పాదయాత్ర..

* శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తర్లాకోటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

* విశాఖ: నేడు నగరంలో పర్యటించనున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు.

* వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు మరోసారి అనుమతి నిరాకరించిన పోలీసులు.. మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ షర్మిల మీడియా సమావేశం.. పాదయాత్రకు అనుమతి నిరాకరించడం పై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న షర్మిల



from NTV Telugu https://ift.tt/zxgZvQP

Baca juga

Post a Comment