Biplab Kumar Deb: త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ దేబ్ ఇంటిపై దాడి.. వాహనాలు ధ్వంసం

Biplab Kumar Deb: త్రిపురలోని గోమతి జిల్లాలోని ఉదయపూర్లో మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ పూర్వీకుల ఇంటి వెలుపల మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పూజారులపై దాడి చేశారు. ఉదయ్పూర్లోని జంజురీ ప్రాంతంలోని రాజధర్ నగర్లోని దేబ్ నివాసానికి పూజారుల బృందం వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది. బుధవారం దేబ్ తండ్రి వార్షిక శ్రాద్ వేడుకలో యజ్ఞం చేయడానికి పూజారులు వచ్చారు.
గుర్తు తెలియని వ్యక్తులు సాధువులపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. చుట్టుపక్కల వారు, స్థానికులు అర్చకులను రక్షించడంతో దుండగులు పారిపోయారు. “నేను త్రిపుర సుందరి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చాను. బుధవారం నిర్వహించే యజ్ఞం సన్నాహాలను చూసుకోవడానికి మా గురుదేవ్ జీ సూచనల మేరకు నేను ఇక్కడకు వచ్చాను. అకస్మాత్తుగా ఒక గుంపు వచ్చి నాపై దాడి చేసి నా వాహనాన్ని ధ్వంసం చేసింది. వారు అరిచారు.” అని వాహనం దెబ్బతిన్న జితేంద్ర కౌశిక్ అన్నారు.
ఈ ఘటనపై స్థానికులు నిరసనకు దిగారు. ఇంతలో, ఆందోళనకారులు దాడికి పాల్పడినట్లు భావిస్తున్న దుకాణాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి నిరుపమ్ దెబ్బర్మ, అదనపు పోలీసు సూపరింటెండెంట్ దేబంజన రాయ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడూ బిప్లబ్ దేబ్ పూర్వీకుల ఇంట్లో లోపల ఎవరూ లేరు. అందుకే ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. దుండగులు బిప్లబ్ దేబ్ ఇంటితో పాటు పక్కనే ఉన్న ఇతర వాహనాలు, బీజేపీ జెండాలను తగులబెట్టారు. సీపీఎం మద్దతుదారులే ఈ హింసాత్మక ఘటనకు పాల్పడ్డారని బీజేపీతో సంబంధమున్న నేతలు పేర్కొంటున్నారు.
Supreme Court: సినిమాలకు వెళ్లేవారికి షాక్.. థియేటర్లలో బయటి ఆహారాలకు అనుమతి లేదని తీర్పు
బిప్లబ్ దేబ్ 1969 నవంబర్ 25న త్రిపురలోని గోమతి జిల్లా రాజధర్ నగర్ గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి హరధన్ దేబ్ స్థానిక జనసంఘ్ నాయకుడు. బిప్లబ్ దేబ్ 1999లో త్రిపురలోని ఉదయపూర్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో 16 ఏళ్ల పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా పనిచేశారు. మధ్యప్రదేశ్ , సాత్నాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన దాదాపు పదేళ్లపాటు సాత్నా బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నారు. 2014లో బనారస్లో లోక్సభ ఎన్నికల కోసం ప్రధాని మోదీ ప్రచారాన్ని నిర్వహించే పనిని కూడా బిప్లబ్ దేబ్ చేశారు. 2014లో ప్రధాని అయిన తర్వాత మోదీ బిప్లబ్ దేబ్ను ఢిల్లీ నుంచి త్రిపురకు పంపించారు. త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రెండు సంవత్సరాలలో బిప్లబ్ దేవ్ ఆ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. దీంతో గత 25 యేండ్ల వామపక్ష సామ్రాజ్యం అంతమైంది. ఈ అద్భుతమైన విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించిన బిప్లబ్ దేబ్కు బీజేపీ బహుమతి ఇచ్చింది.2018లో ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది.
from NTV Telugu https://ift.tt/vEKhZ0Y
Post a Comment
Post a Comment