Gold Price Today: బంగారం ప్రియులకు భారీ షాక్.. పెరిగిన ధర.. తులంపై ఒక్క రోజే ఎంతంటే?

గత కొన్నిరోజులుగా వరుసగా తగ్గుతూపోయిన గోల్డ్ రేట్స్.. నేడు పెరిగింది. వరుసగా మూడో రోజుల తర్వాత నేడు బంగారం ధరలో పెరుగదల కనిపించింది. జవనరి 10వ తేదీన రూ. 150, 11వ తేదీన రూ. 180 తగ్గిన బంగారం ధర తాజాగా శుక్రవారం రూ.100 పెరిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,550గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,220 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 51,400గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 56,070గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,360 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,120గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 51,450 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 56,120 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,070వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరూ. 51,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,070 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 51,400, 24 క్యారెట్స్ ధర రూ. 56,070 గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి కూడా బంగారం దారిలోనే వెళ్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరల్లోనూ పెరుగదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం కిలో వెండి ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం… దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,900గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 71,900 వద్ద కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వెండి ధరలో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 74,000గా నమోదుకాగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 74,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/cpoF9HG
Post a Comment
Post a Comment