RBI Penalty: ఈ నాలుగు బ్యాంకులపై భారీ జరిమానా.. ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు బ్యాంకులకు జరిమానా విధించింది. ఈ బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన నిబంధనలను పాటించలేదు. ఈ కారణంగా ఈ బ్యాంకులు జరిమానా విధించింది. వీటిపై రూ. 8 లక్షల వరకు జరిమానా విధించింది. ఇవన్నీ సహకార బ్యాంకులు, ఇవి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను నిర్వహిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏయే బ్యాంకులకు జరిమానా విధించిందో తెలుసుకుందాం.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ).. బఘత్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, సాహెబ్రావ్ దేశ్ముఖ్ కోఆపరేటివ్ బ్యాంక్, శరద్ సహకరి బ్యాంక్, కల్నల్ ఆర్డీ , నికమ్ సైనిక్ సహకారి బ్యాంకుపై పెనాల్టీ విధించబడింది.
ఏ బ్యాంకులో ఎంత జరిమానా
సోలన్ హిమాచల్ ప్రదేశ్కు చెందిన బఘత్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్పై గరిష్టంగా రూ.8 లక్షల జరిమానా విధించింది. దీని తర్వాత పూణేలోని శరద్ సహకరి బ్యాంకుకు రూ.6 లక్షల జరిమానా విధించారు. ముంబైకి చెందిన సాహెబ్రావ్ దేశ్ముఖ్ కోఆపరేటివ్ బ్యాంక్పై రూ.1 లక్ష, సతారాకు చెందిన కల్నల్ ఆర్డీ నికమ్ సైనిక్ సహకారి బ్యాంక్పై రూ.లక్ష జరిమానా విధించారు.
ఏయే సెక్షన్లలో జరిమానా విధించారు
ఆర్బీఐప్రకటన ప్రకారం, ఈ జరిమానా ఆర్బీఐ సెక్షన్ 47 A (1) (c), 46 (4) (i), బ్యాంకింగ్ రెగ్యులేటరీ యాక్ట్ 1949లోని సెక్షన్ 56 ప్రకారం విధించబడింది. ఈ బ్యాంకులు ఆర్బీఐ సూచనలను పాటించలేకపోతున్నాయి. ఈ జరిమానా బ్యాంకు లావాదేవీలపై ప్రభావం చూపదని, ఖాతాదారులతో ఎలాంటి సంబంధం ఉండదని బ్యాంక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
ఆర్బీఐ నిబంధనలను పాటించలేదు :
బఘత్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లకు సంబంధించిన ఆర్బీఐ ప్రత్యేక ఆదేశాలను పాటించలేదు. అదేవిధంగా సాహెబ్రావ్ దేశ్ముఖ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆర్బీ నిబంధనలు పాటించలేదని, అలాగే కేవైసీ అప్డేట్లో విఫలమైనందున ఈ బ్యాంకులపై జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. అదే సమయంలో, కస్టమర్ల డబ్బును చెల్లించేటప్పుడు, కరెంట్ ఖాతాలలో ఉన్న బ్యాలెన్స్పై వర్తించే వడ్డీని చెల్లించలేదు. ఇలా పలు నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/GxNz2hY
Post a Comment
Post a Comment