What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

* నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌ షో.. ట్రాఫిక్‌ ఆంక్షలు

* నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. సాయంత్రం 4 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నడ్డా ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం.. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగంతో ముగియనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

* ఢిల్లీ: ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశం కానున్న బీజేపీ “ఆఫీస్ బేరర్లు”

* శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీస్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణం.. అమ్మవారిని ఆడపడుచుగా భావించి శ్రీస్వామి అమ్మవారికి కళ్యాణ వస్త్రాలు సమర్పించిన చెంచు గిరిజనులకు చెంచు గిరిజనులతో పాటు స్వామి అమ్మవారి కళ్యాణ వస్త్రాలు సమర్పించిన ఐటీడీఏ పి.ఓ రవీంద్రారెడ్డి

* నేడు కనుమ పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగన్నతోటలో ప్రభల ఉత్సవం..

* ఒంగోలు రంగారాయుడు చెరువులో ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం, హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ప్రకాశం : మర్రిపూడి మండలం గుండ్లసముద్రంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు..

* బాపట్ల : చీరాల మండలం ఈపురుపాలెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2కే రన్ కార్యక్రమం.

* ప్రకాశం : కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల ఫైనల్స్..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేతలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు

* నెల్లూరు: కనుమ సందర్భంగా నెల్లూరు నగరంలోని బోడిగాడి తోటలో పెద్దల పండుగ

* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో పార్వేటి ఉత్సవం, ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

* మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ -1 నిందితుడు ఏర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటేషన్ పై నేడు తీర్పు వెలువరించనున్న సుప్రీం కోర్టు.

* తిరుపతి: నేడు అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్న చంద్రబాబు..

* తిరుపతి: నేడు చంద్రగిరి నియోజక వర్గం ఏ.రంగంపేటలో జల్లికట్టు పోటీలు

* ఆదిలాబాద్: నేడు కలెక్టరేట్ ముందు ధర్నాకు ఆదివాసి సంఘాల పిలుపు.. పత్తి ధర క్వింటాల్ కు 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగనున్న తుడుం దెబ్బ నాయకులు



from NTV Telugu https://ift.tt/Xvd5Iay

Baca juga

Post a Comment