UN: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యూఎన్ లో ఓటింగ్.. మరోసారి ఇండియా గైర్హాజరు..

RUSSIA-UKRAINE WAR: ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసి ఏడాది గడుస్తున్న సందర్భంగా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని, తక్షణమే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యాను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఈ తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి. 193 దేశాలు ఉన్న యూఎన్ జనరల్ అసెంబ్లీలో 141 సభ్యదేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానాన్ని 7 దేశాలు వ్యతిరేకించగా, 32 దేశాలు గైర్హాజరు అయ్యాయి.
Read Also: World Bank: ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి ఇండో అమెరికన్.. నామినేట్ చేసిన అమెరికా
గతంలో రష్యాపై యూఎన్ తీర్మాన సమయంలో అనుసరించిన విధంగానే మరోసారి భారత్ తటస్థతను ప్రదర్శించింది. భారత్ ఓటింగ్ కు గైర్హాజరు అయింది. చైనా కూడా ఓటింగ్ కు దూరంగా ఉంది. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ఉక్రెయిన్, రష్యాలు సమస్యలను పరిష్కరించుకోవాలని తొలి నుంచి భారత్ చెబుతోంది. దీంతో పలుమార్లు ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు దూరంగా ఉంది.
ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా ఉక్రెయిన్లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని నెలకొల్పాలని తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానం పేర్కొంది. దీనికి కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సభ్యదేశాలు, అంతర్జాతీయ సంస్థలు తీర్మానంలో పిలుపునిచ్చాయి.
from NTV Telugu https://ift.tt/gSEOrJe
Post a Comment
Post a Comment