What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Today Events February 21, 2023
*నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవాలు
*శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి శ్రీ సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిడిమాను ఉత్సవం
*గుంటూరు ఈనెల 26 నుండి మార్చి 9 వరకు 12 రోజుల పాటు మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు
*నేడు వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, మున్సిపల్ చైర్మన్ దస్తగిరి అధ్యక్షతన 107 అంశాలతో కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్న అధికారులు
*అనంతపురంలో ఈనెల 22 న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం. హాజరు కానున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
*నెల్లూరులోని ఇందిరా భవన్ లో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పై నేతలతో సమావేశం కానున్న పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. ఏఐసిసి కార్యదర్శి మయ్యప్పన్
*వెంకటగిరిలో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించనున్న నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
*అన్నమయ్య జిల్లా లక్కీ రెడ్డి పల్లె మండలం అనంతపురంలో నేడు గంగమ్మ జాతర..పెద్దఎత్తున హాజరు కానున్న భక్తులు
*కాకినాడలో నేడు ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థలు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కుడుపూడి సూర్యనారాయణ
*నేటి నుంచి యానాంలో మీసాల వెంకన్న కళ్యాణోత్సవాలు… ఉదయం పూజా కార్యక్రమాలతో పెండ్లి కుమారుడి ఉత్సవాలు…సర్పవాహనంపై ఊరేగనున్న స్వామి వారు
*మార్చి 1వ తేదీనుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చెయ్యనున్న టీటీడీ..సర్వదర్శనం,లడ్డు కౌంటర్లు,గదులు కేటాయింపు,రిఫండ్ కౌంటర్లు వద్ద నూతన టెక్నాలజిని అమలు చెయ్యనున్న టీటీడీ..ఫేస్ రికగ్నిషన్ విధానంలో అక్రమాలకు చెక్ పడడంతో పాటు భక్తులకు సులభతరంగా సేవలు అందించవచ్చునంటున్న టీటీడీ
from NTV Telugu https://ift.tt/CfkUvy0
Post a Comment
Post a Comment