What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

* నేటి నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్‌ .. ఇండోర్‌ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో భారత్‌

* నేడు కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.. బీర్కూర్‌లోని టీటీడీ దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న కేసీఆర్

* తు.గో జిల్లా: నేడు నిడదవోలుకు సీఎం వైఎస్‌ జగన్.. ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న ముఖ్యమంత్రి జగన్..

* తిరుమలలో నేటి నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్‌రికగ్నిషన్‌ యాప్‌.. సర్వదర్శనం, లడ్డూకౌంటర్లు, గదుల కేటాయింపు, రీఫండ్‌ కౌంటర్ల దగ్గర ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను వినియోగించనున్న టీటీడీ

* నెల్లూరు : కందుకూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ నగరేశ్వర స్వామి వారి స్పటిక శివలింగం ప్రతిష్ట కార్యక్రమం..

* ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీ ఆవరణలో స్పందన కార్యక్రమం పై సమీక్ష.. హాజరుకానున్న రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు..

* అనంతపురం : పెద్దపప్పూరు మండలంలో రెండవ రోజు ప్రజా సంక్షేమ పాదయాత్ర.. కొత్తపల్లి గ్రామం వద్ద ప్రారంభమై నారాపురం, సోమనపల్లి, తిమ్మనచెరువు, జూటూరు గ్రామాలలో పాదయాత్ర చేయనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.

* అనంతపురం : ఎమ్మెల్సీ ఎన్నికలప్తె కళ్యాణదుర్గం నియోజకవర్గ నేతలతో మంత్రి ఉషశ్రీ చరణ్ సమీక్షా సమావేశం.

* అనంతపురం : నేటి నుంచి రెండు రోజుల పాటు జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు.

* విజయవాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

* బాపట్ల: కొల్లూరులో పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.

* శ్రీ సత్యసాయి : ఈనెల 2 నుంచి కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరహింహాస్వామి బ్రహ్మోత్సవాలు. 3వ తేదీ శ్రీవారి కళ్యాణోత్సవం.. 13న బ్రహ్మరథోత్సవం.

* తూర్పుగోదావరి జిల్లాలో హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. ఉదయం 10 గంటలకు సీఎం జగన్‌కు ఆహ్వానం పలకనున్న మంత్రి.. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరు

* తిరుపతి: ఉదయం 8 గంటలకు గాదంకి టోల్ గేట్ (పాకాల మండలం) విడిది కేంద్రం నుంచి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం.. గాదంకి, నేండ్రగుంట, ఇర్రంగారిపల్లి, పాకాల మీదుగా గుమ్మడివారి ఇండ్లు వరకు సాగనున్న పాదయాత్ర

* క‌డ‌ప మార్కెట్ యార్డులో క‌మీష‌న్ ఏజెంట్ల ఆందోళ‌న‌తో రెండో రోజు నిలిచిపోయిన ప‌సుపు కొనుగోళ్లు. గోడౌన వివాదంపై కలెక్టర్ ఆరా… నేడు ఆర్డీవో ఆధ్వర్యంలో చ‌ర్చలు.

* క‌డ‌ప: నేడు ప్రముఖ పుణ్యక్షేత్రం పుష్పగిరిలో గిరి ప్రద‌ర్శన‌ను ప్రారంభించ‌నున్న పీఠాధిప‌తి విద్యాశంక‌ర భార‌తి..



from NTV Telugu https://ift.tt/OB8i5yk

Baca juga

Post a Comment