What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ 6 వ రోజు..రాష్ట్రపతి ప్రసంగంపై ప్రారంభం కాని చర్చ…అదానీ షేర్ల పతనం, హిండేన్ బర్గ్ నివేదికపై చర్చ కు డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు
*ఆంధ్రా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా..షెడ్యూల్ ప్రకారం ఈనెల 10నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ఎగ్జామ్స్….సిలబస్ పూర్తి కానందున వాయిదా వేస్తున్నట్టు కంట్రోలర్ ప్రకటన
* దిల్ సుఖ్ నగర్ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 11 వరకూ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ప్రాణ ప్రతిష్టాపన మరియు మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు
*తూర్పుగోదావరి జిల్లా నేటి నుండి 10వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
*తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో రెండో రోజు రికార్డులను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు
*నెల్లూరు రూరల్ పరిధిలోని కొండాయపాలెం గేట్ ప్రాంతంలో ఆత్మీయ సదస్సు నిర్వహించనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
*తణుకులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమురి నాగేశ్వర రావు.. తాడేపల్లిగూడెం, ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ నందు నూతనంగా నిర్మించిన ఫార్మసీ భవనం ప్రారంభోత్సవానికి హాజరుకానున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
*బాపట్ల జిల్లా వేమూరు మండలం కోడి తాడిపర్రు లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున
*అనంతపురం జిల్లా లేపాక్షిలో జీ20 సమ్మిట్
*సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు SIPB సమావేశం
*శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వాలంటీర్లు ,కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణా తరగతులు…పాల్గొననున్న స్పీకర్ తమ్మినేని సీతారాం
*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండోరోజు పాదయాత్ర..ఉదయం 8.30కి రామప్ప ఆలయంలో పూజలు… పూజల అనంతరం పాలంపేట నుంచి పాదయాత్ర ప్రారంభమై కేషపూర్ మీదుగా మధ్యాహ్నం 1.30 వరకు నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు చేరుకోనున్న పాదయాత్ర.
from NTV Telugu https://ift.tt/wReMx5J
Post a Comment
Post a Comment