China Space Station: అంతరిక్షంపై సత్తా చాటేందుకు సిద్ధమైన డ్రాగన్‌.. అమెరికాకు ధీటుగా ప్రయత్నాలు

China Space Station

China Space Station: అంతరిక్షంపై శక్తి చాటేందుకు సిద్ధమైంది డ్రాగన్‌. ఏకంగా అక్కడ స్పేస్‌ స్టేషనే నిర్మిస్తోంది. ఇందు కోసం ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. అమెరికాకు ధీటుగా ప్రపంచాన్ని శాసించాలచి చూస్తున్న చైనా ఇప్పుడు ఖగోళం మీద కూడా పట్టు సాధించే దిశా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏకంగా అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు చేపట్టింది. ఇందు కోసం ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. చెన్‌డాంగ్‌, ల్యూ యాంగ్‌, చైషూఝె అనే ఈ ముగ్గురు షెన్‌ఝూ-14 అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్లారు. అక్కడ ఆరు నెలలపాటు ఉండి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తారు. ఈ స్పేస్‌ స్టేషన్‌కు ‘తియాంగాంగ్‌’ అనే పేరు పెట్టారు..

2030 నాటికి తమ వ్యోమగాములను చంద్రునిపైకి ప్రవేశ పెట్టాలన్నది చైనా ప్రణాళిక. ఇందులో భాగంగా ఈ ఏడాది 2022లో తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. 2025 నాటికి గ్రహశకలాల నమూనాల సేకరణ, 2030 నాటికి మార్స్‌పై ఉన్న నమూనాలను భూమికి చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. 2045 నాటికి కీలక అంతరిక్ష శక్తిగా ఎదగాలని భావిస్తున్న డ్రాగన్‌.. 2035 నాటికి పునర్వినియోగ రాకెట్లు, 2040 నాటికి అణుశక్తితో పనిచేసే స్పేస్‌ షటిల్‌ తయారీ పూర్తి చేయాలని భావిస్తోంది..

అమెరికా, సోవియట్‌, ఫ్రాన్స్‌, జపాన్‌ తర్వాత 1970లో చైనా తొలిసారి అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపింది. గత 10ఏళ్లలో 200 రాకెట్లును ప్రయోగించింది. ఇప్పటికే మానవరహిత వాహనాన్ని చంద్రుడిపైకి పంపింది. తాజా ప్రయోగంతో కలిపి ఇప్పటి వరకూ 14 మంది వ్యోమగాములను అందరిక్షంలోకి పంపింది డ్రాగన్‌.. మరోవైపు భారత్‌ కూడా 2030 నాటికి అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మించాలని భావిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/As4aE2U

Baca juga

Post a Comment